కృష్ణా మరియు బాపట్ల జిల్లాలలోని మచిలీపట్టణం, కోడూరు, నాగాయలంక, రేపల్లె మండలాలలో 194.81 చదరపు కి.మీ విస్తీర్ణం లో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. కృష్ణా నదీ ముఖద్వారంలో ఈ మడ అడవులు రైజోఫోరా, అవిసెన్నియా, సొన్నెరాటియా, ఏజిసెరోస్, తుమ్మ, మర్రి, రావి, మామిడి వంటి మొక్కలు; చేపలు పట్టే పిల్లి, ఓటర్, నక్క, నత్త మొసలి, గార్డెన్ లిజార్డ్, వాల్ లిజార్డ్, తాబేళ్ళు , అనేక రకాలైన పాములు మరియు వివిధ రకాల స్థానిక మరియు వలస పక్షులు వంటి ప్రత్యేకమైన వృక్షజాలం & జంతుజాలం కలిగి ఉంది. సొర్లగుండ, నాచుగుంట, ఎలిచెట్లదిబ్బ, కొత్తపాళెం, మోలగుంట, అడవుల దీవి, లంకివానిదిబ్బ అటవీ కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి.
ఈ మడ అడవులు అత్యంత సున్నితమైన మరియు ఉత్పాదక మండలం మాత్రమే కాకుండా రొయ్యలు, షెల్ మరియు ఫిన్ చేపలకు నర్సరీ స్థలం కూడా. ఇది అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు సంతానోత్పత్తి ప్రదేశం.
ఎలా చేరుకోవాలి?
- మండల కేంద్రం: నాగాయలంక (57 km)
- జిల్లా కేంద్రం: మచిలీపట్టణం (76 km)
- సమీప పట్టణం: రేపల్లె (44 km)
- సమీప బస్సు స్టేషన్: రేపల్లె (44 km)
- సమీప రైల్వే స్టేషన్: రేపల్లె (44 km)
- సమీప విమానాశ్రయం : విజయవాడ (107 km)
వసతి మరియు భోజన సదుపాయాలు
44 km దూరం లో ఉన్న రేపల్లె పట్టణం లో బడ్జెట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. స్టార్ హోటల్ సదుపాయాలు విజయవాడ (107 km), గుంటూరు (109 km) లలో అందుబాటులో ఉన్నాయి.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి